మోడీ-పకోడి కావాలా నాయానా...నెల్లూరులో టిడిపి వినూత్న నిరసన
నెల్లూరు:ఎపి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల్లూరులో టిడిపి విద్యార్థి సంఘం సభ్యులు వినూత్ననిరసన చేపట్టారు. ఒక పకోడి బండి పెట్టి...ఆ పకోడికి మోడీ పేరు పెట్టి హల్ చల్ చేశారు. అలాగే గుజరాతీ ఛాయ్ మా స్పెషల్ అంటూ టీ అమ్మకాలు కూడా చేశారు
నెల్లూరులో రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంపై తెలుగుదేశం విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వీఆర్ సీ సెంటర్ లో రోడ్డుపై పకోడి వేయడం తో పాటు ఆ పకోడీకి మోడీ-పకోడీ అని నామకరణం చేసి రోడ్డు వెంబటి వెళ్లేవారిని ఉద్దేశించి మోడీ పకోడీ కావాలా నాయానా అంటూ నినాదాలు చేశారు.

అలాగే ఎపిని కేంద్రం దారుణంగా మోసగించిందంటూ టీ అమ్మకాలు కూడా చేశారు. మోడీ-పకోడీతో పాటు గుజరాతీ ఛాయ్ మా ప్రత్యేకత అంటూ బ్యానర్ పెట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని...ఇక ఎపిలో యువత పరిస్థితి...మోడీ పేరు చెప్పుకుంటూ పకోడీ-టీ అమ్ముకోవడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications