రైడ్స్ లైవ్ టెలికాస్ట్ చేయాలి.. లేదంటే కక్ష సాధింపు చర్యలే: సీపీఐ నారాయణ
కేంద్ర ప్రభుత్వ తీరును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల గురించి మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వ్యతిరేకించే పార్టీలపై, వ్యాపార సంస్థలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తరచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోపల ఏం జరుగుతుందో తెలియదని.. దాడులు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోవాలని అని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో బీజేపీలోకి రావాలని వారిని బెదిరిస్తున్నారని తెలిపారు.

అధికారుల వద్దే కెమెరాలు ఉంటున్నందున సోదాలు లైవ్లో చూపించాలని కోరారు. అక్కడే ఏం జరిగిందో లైవ్లో ప్రకటించవచ్చని సూచించారు. లైవ్లో చూపించకపోతే మాత్రం అది కక్ష సాధింపు చర్యల కిందే భావించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ తీరుతో అందరికీ అదే అర్థం అవుతుందని చెప్పారు.
సీపీఐ నారాయణ తరచూ వార్తల్లో ఉంటారు. అన్నీ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయిస్తోన్న ఐటీ దాడుల గురించి కామెంట్ చేశారు. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపు చర్యే అవుతుందని తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications