కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 26వ తేదీ నుంచి డిస్ట్రిబ్యూట్.. మంత్రులు, ఎమ్మెల్యేలు
కొత్త రేషన్ కార్డులను పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు.
పౌరసరఫరాలశాఖపై మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ వారితో చర్చించారు. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్కు ఆదేశాలు జారీచేశారు.
ప్రస్తుతం రేషన్ మీద బియ్యం అందజేస్తున్నారు. కరోనా వల్ల ఒక్కొక్కరికీ 15 కిలోల బియ్యం ఇస్తున్నారు. అంతకుముందు చక్కెర, పప్పులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బియ్యం, సర్ప్ మాత్రమే ఇస్తున్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఎక్కువగా బియ్యం ఇస్తారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications