ఓ సారూ.. సోయిలోకి రా... ఆరోగ్య శ్రీలో చేర్చు.. షర్మిల నిప్పులు
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణలో మరికొన్ని గంటల నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే కరోనా బారిన పడిన సామాన్యుడి సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. ఇదే అంశాన్ని వైఎస్ షర్మిల ప్రస్తావించారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్పై ట్విటర్లో వైఎస్ షర్మిల విరుచుపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చమని ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు, మృతులు పెరుగుతుండటంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా పెట్టడు.. అడుక్కు తిననీయడు అని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు, కేంద్ర ఆయుష్మాన్ భారత్లో చేరడు. దొర నిర్ణయాలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నవి అని ఫైరయ్యారు.

హైదరాబాద్ చుట్టూ నాలుగు దిక్కులా ఆసుపత్రులేనని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ ఇచ్చేది మాత్రం లేదన్నారు. ఉస్మానియా, గాంధీ, టిమ్స్, నిమ్స్లకే ఊపిరి సక్కగా అందట్లేదు అని గుర్తుచేశారు. ఇక అందులో చేరిన వారికి వైద్యం గాలిలో దీపం చందంలా మారిందని చెప్పారు. కేసీఆర్ సారూ.. ఇకనైనా సోయిలోకి రా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు అని షర్మిల విమర్శించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications