మరో మంకీపాక్స్ కేసు.. మరింత ముమ్మరంగా తనిఖీలు, కేంద్రం ఆదేశం
దేశంలో మరో మంకీ పాక్స్ కేసు వెలుగుచూసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విమానాశ్రయంలో పకడ్బందీగా తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టంచేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టులు, పోర్టుల వద్ద కఠినంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. కేరళలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. పోర్టులు, ఎయిర్పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పోర్టులు, ఎయిర్పోర్టుల వద్ద ఇండియా వచ్చే ప్రయాణికులకు కచ్చితమైన హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనుమానిత ప్రయాణికులు ఐసోలేషన్లో ఉంటూ, తగినంత దూరం పాటించేలా, దగ్గరలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. గతంలో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలోనే హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు ఇతర దేశాల ప్రయాణికుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాలు, ఎయిర్పోర్టులు, పోర్టులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications