షాక్: ఆధార్ ను లింకు చేయకపోతే బ్యాంకు అకౌంట్ క్లోజ్
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ: అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది.
రూ.50 వేలు, ఆపై ఆర్థిక లావాదేవీ ప్రతిదానికి ఆధార్ ను తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతమున్న బ్యాంకు అకౌంట్ ఖాతాదారులంతా 2017 డిసెంబర్ 31 వరకు ఆధార్ ను బ్యాంకుల్లో సమర్పించాలని , లేని పక్షంలో ఆ అకౌంట్లు చెల్లనివిగా మారుతాయని కేంద్రం హెచ్చరించింది.

పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు ఆధార్ ను అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయడాన్ని పలుమార్లు విచారించిన అనంతరం గత వారమే సుప్రీంకోర్టు దీన్ని సమర్థిస్తున్నట్టు పేర్కొంది.
అయితే ఎవరైతే ఈ యూనిక్ ఐడీని కలిగి ఉంటారో వారు పాన్ కార్డుకు దాన్ని లింక్ చేసుకోవాలని ,ఆధార్ కార్డు లేని వారి విషయంలో దీన్ని పట్టుబట్టరాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.అయితే వెను వెంటనే ఆధార్ కార్డు తప్పనిసరైతే మరో కొత్త ఆదేశాలను కేంద్రం జారీ చేసింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications