జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే: లోక్సభలో పన్నీర్ వర్గం
పన్నీర్ వర్గం ఎంపీ పీఆర్ సుందరం లోక్ సభలో మరోసారి అమ్మ మృతి అంశాన్ని లేవనెత్తారు. జయలలిత మృతికి సంబంధించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పన్నీర్ సెల్వం వర్గం నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారు. తాజాగా పన్నీర్ వర్గం ఎంపీ పీఆర్ సుందరం లోక్ సభలో మరోసారి అమ్మ మృతి అంశాన్ని లేవనెత్తారు. జయలలిత మృతికి సంబంధించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ సీబీఐ దర్యాప్తు చేపట్టినా అది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరగకూడదని, కేంద్రం ఆదేశాలతోనే జరగాలని పీఆర్ సుందరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలిస్తే.. వాస్తవాలను, రహస్యాలను బయటకు పొక్కనివ్వకుండా చేసే అవకాశముందన్నారు. కాగా, జయలలిత చికిత్సకు సంబంధించి ఎయిమ్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ చాలామందిలో ఇంకా అనుమానాలు నెలకొనే ఉన్నాయి. నటి గౌతమి, పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సహా పలువురు జయలలిత మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈరోజు లోక్ సభ జీర్ అవర్ లో అన్నాడీఎంకె ఎంపీలు శ్రీలంకలోని తమిళుల సమస్యల గురించి లేవనెత్తారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తమిళులపై హింస పెరిగిపోతుందని సభలో ప్రస్తావించారు. శ్రీలంకను మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ దీనిపై సీరియస్ గా స్పందించారు. శ్రీలంకలో తమిళుల సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications