ఎయిమ్స్ ఢిల్లీ సర్వర్ డౌన్, రామ్ సర్ వేర్ దాడి జరిగే ఛాన్స్..?
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ సర్వస్ డౌన్ అయ్యింది. గత 9 గంటల నుంచి పనిచేయడం లేదు. ఇక్కడ నేషనల్ ఇఫర్మేటిక్స్ సెంటర్ ఈ హాస్పిటల్ సర్వర్ ఉపయోగిస్తారు. దీంతో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, స్మార్ట్ ల్యాబ్, బిల్టింగ్, రిపోర్ట్ జనరేషన్, అపాయింట్ మెంట్ సిస్టమ్.. తదితర సేవలకు అంతరాయం కలుగుతుంది.దీంతో అన్ని సేవలను మ్యానువల్గా చేస్తున్నారు.
రాత్రి 7.30 గంటలకు ఈ ప్రకటన చేశారు. తమ సర్వర్ డౌన్ అయ్యిందని.. రామ్సర్ వేర్ దాడి జరిగి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం చేరవేశామని తెలిపింది. ఆస్పత్రిలో డేటా చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మాజీ ప్రధాన మంత్రులు, ఇతర మంత్రుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. దీంతో ఆందోళన నెలకొంది.
డిజిటల్ సేవల పునరుద్దరణ కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భవిష్యత్లో ఇలాంటి దాడులు నివారించడానికి ఎయిమ్స్, ఎన్ఐసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు.