పొలంలో పడిపోయిన తేజస్ ఫ్యూయల్ ట్యాంక్
కోయంబత్తూరు : ఇండియన్ ఆర్మీకి చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎల్సీఏ తేజస్ విమాన ఫ్యూయల్ ట్యాంక్ ఊడి పడింది. తమిళనాడులో ఓ పొలంపై నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం విమానం సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
మంగళవారం ఉదయం ఎయిర్ ఫోర్స్కు చెందిన తేజన్ విమానం సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఓ వ్యవసాయ భూమిలో అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో పొలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యవసాయ భూమిలో పడిన ఫ్యూయల్ ట్యాంక్ అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించేది కావడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించారు.

గతవారం హర్యానాలోని అంబాలాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన జాగ్వర్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక ఇంజన్ పనిచేయడం మానేసింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఇంధనం, ఇతర తేలిక బాంబులను పైలెట్ కిందకు వదిలేశాడు. అనంతరం యుద్ధ విమానంను అంబాలా ఎయిర్బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications