నేడే 'రాష్ట్రపతి' ఎన్నికకు పోలింగ్: రామ్నాథ్ ఎన్నికవడం లాంఛనమే..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత స్థాయి పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక కోసం నేడు ఎన్నికలు జరగనున్నాయి. బలబలాల పరంగా ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే ఎక్కువ అవకాశాలు ఉండటంతో.. ఎన్నిక నామమాత్రమే అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలలో సోమవారం ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి రేసులో ఎన్డీఏ పక్షాల తరపున రామ్నాథ్ కోవింద్, యూపీఏ పక్షాల తరపున మీరా కుమార్ పోటీ పడుతున్నారు.

నేటి ఎన్నికల ప్రక్రియలో మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీలంతా పార్లమెంటులో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో సరైన కారణం చూపించగలిగితే మాత్రం.. ఈసీ అనుమతితో వేరే పోలింగ్ కేంద్రాల్లోను ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఇక ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గత ఎన్నికల్లో ఆ బాధ్యతను రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications