రేపే బీహార్లో కీలకమైన రెండోదశ పోలింగ్- బరిలో తేజస్వీ సహా 1500 మంది- 2.85 కోట్ల ఓటర్లు
బీహార్లో కీలకమైన రెండోదశ పోలింగ్కు సర్వం సిద్దమైంది. 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాల్లో ఉన్న 2.85 కోట్ల ఓటర్లు 1500 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఇందులో మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ సహా పలువురు కీలకమైన అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
రేపు పోలింగ్ జరిగే జిల్లాల్లో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షియోహర్, సీతామర్హీ, మధుబని, దర్భంగా, ముజఫర్ పూర్, గోపాల్ గంజ్, శివాన్, శరణ్, వైశాలీ, సమస్తీపూర్, బెగూసరాయ్, ఖగారియా, భాగల్పూర్, నలంద, పాట్నా ఉన్నాయి. ఇందులో వైశాలీ జిల్లాలోని రాఘవ్పూర్ నుంచి మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ రంగంలో ఉన్నారు. నితీశ్ కేబినెట్లోని పలువురు సీనియర్ మంత్రులు కూడా ఇతర నియోజకవర్గాల్లో బరిలో ఉన్నారు. గతంలో రాఘవ్పూర్లో తేజస్వి తల్లి రబ్రీదేవిని ఓడించిన సతీష్కుమార్తో ఆయన మరోసారి తలపడుతున్నారు.

బీహార్ అసెంబ్లీలోని మూడో వంతు స్ధానాల్లో రెండోదశ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో కీలకమైన రెండోదశ కోసం ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఏడు ర్యాలీలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. మహాకూటమి అభ్యర్ధులను ఎదుర్కనేందుకు సీఎం నితీశ్ కుమార్ చెమటోడుస్తున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఈసారి తేజస్వీ సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఎన్డీయే అభ్యర్ధులను గెలిపించుకునేందుకు మోడీ-నితీశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండోదశ పోలింగ్ తర్వాత ఫలితాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఇరు కూటములకూ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications