ఇండిగో మరో‘సారీ’: వీల్చైర్ నుంచి కిందపడిన పెద్దావిడ, గాయాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్లైన్స్ మరో వివాదం తెచ్చుకుంది. ఇటీవల ఢిల్లీలో ఓ ప్రయాణికుడిపై తమ సిబ్బంది దాడి చేసినందుకు ఇండిగో క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఓ పెద్దావిడ వీల్చైర్లో నుంచి కిందపడి గాయపడటంతో ఆ సంస్థ మరోసారి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. లక్నో విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్చైర్లో తీసుకెళుతుండగా ఆమె కిందపడిపోయారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మరోసారి విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇండిగో విమానయాన సంస్థ ఈ ఘటనపై స్పందించింది. 'నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఊర్వశి పారిఖ్కు క్షమాపణ తెలుపుతున్నాం' అని పేర్కొంది.
'రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడం, తారురోడ్డుపై గుంతపడడం వల్ల వీల్చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె కోలుకున్నారు' అని ఇండిగో వివరించింది. అంతేగాక, ఇందులో మానవ తప్పిదం లేదని ఊర్వశి చెప్పినట్టు ఇండిగో పేర్కొంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications