ఇండిగో మరో‘సారీ’: వీల్చైర్ నుంచి కిందపడిన పెద్దావిడ, గాయాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్లైన్స్ మరో వివాదం తెచ్చుకుంది. ఇటీవల ఢిల్లీలో ఓ ప్రయాణికుడిపై తమ సిబ్బంది దాడి చేసినందుకు ఇండిగో క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఓ పెద్దావిడ వీల్చైర్లో నుంచి కిందపడి గాయపడటంతో ఆ సంస్థ మరోసారి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. లక్నో విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్చైర్లో తీసుకెళుతుండగా ఆమె కిందపడిపోయారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మరోసారి విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇండిగో విమానయాన సంస్థ ఈ ఘటనపై స్పందించింది. 'నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఊర్వశి పారిఖ్కు క్షమాపణ తెలుపుతున్నాం' అని పేర్కొంది.
'రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడం, తారురోడ్డుపై గుంతపడడం వల్ల వీల్చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె కోలుకున్నారు' అని ఇండిగో వివరించింది. అంతేగాక, ఇందులో మానవ తప్పిదం లేదని ఊర్వశి చెప్పినట్టు ఇండిగో పేర్కొంది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications