జయలలిత మృతి: బెంగళూరు జైల్లో శశికళకు సమన్లు, ఇలా కుదరదు, చిన్నమ్మ!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమిషన్ చిన్నమ్మ శశికళకు సమన్లు జారీ చేసింది.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఈ మెయిల్ ద్వారా సమన్లు పంపించారు. విచారణకు సిద్దంగా ఉండాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళకు సూచించింది.

ఈమెయిల్ ద్వారా శశికళకు సమన్లు జారీ అయ్యాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు దృవీకరించారు. అయితే తనకు ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేశారని, నేరుగా వచ్చి సమన్లు జారీ చేస్తే విచారణకు అంగీకరిస్తానని శశికళ తనదైన శైలిలో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమాధానం ఇచ్చారని జైళ్ల శాఖ అధికారులు చెప్పారు..
ఇదే సందర్బంలో గురువారం చిన్నమ్మ శశికళతో భేటీ అయిన టీటీవీ దినకరన్ శశికళ 2018 జనవరి చివరి వరకూ మౌనవ్రతం చేస్తారని చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద అతి త్వరలో బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళను ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications