సూరత్లో అణుబాంబు పేల్చాలనుకున్న యాసిన్భత్కల్
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు అణుబాంబును ఉపయోగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అణుబాంబుతో గుజరాత్లతోని సూరత్లో దాడి చేయడానికి స్కెచ్ గీశారు. ఈ విషయాన్ని ఐఎం ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడించాడు.
వరుస పేలుళ్లతో ఇప్పటికే మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు అణు పేలుళ్లతో నగరాలకు నగరాలనే శ్మశాన దిబ్బలుగా మార్చేందుకు వ్యూహ రచన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 27న భత్కల్ను భారత్ - నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

విచారణ సందర్భంగా భత్కల్ అత్యంత కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది. తనకో చిన్న అణుబాంబును పంపించగలవా అని పాకిస్థాన్లోని తమ బాస్ రియాజ్ భత్కల్ను ఫోన్లో అడిగానని, పాకిస్థాన్లో దేనినైనా సమకూర్చవచ్చు అని రియాజ్ జవాబిచ్చాడని, సూరత్లో దాడికి తనకొక అణుబాంబును పంపించాలని కోరానని, అణుబాంబు పేలుళ్లతో ముస్లిములు కూడా చచ్చిపోతారు కదా అని రియాజ్ ఆందోళన వ్యక్తం చేశాడని యాసిన్ చెప్పాడు.
ప్రతి ముస్లిం కుటుంబం కూడా చడీ చప్పుడు చేయకుండా, ఎవరికీ ఏమీ చెప్పకుండా నగరం విడిచి వెళ్లిపోండని మనం మసీదులన్నిటిలోనూ పోస్టర్లు అంటిద్దామని తాను జవాబిచ్చానని యాసిన్ భత్కల్ చెప్పినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications