సూరత్లో అణుబాంబు పేల్చాలనుకున్న యాసిన్భత్కల్
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు అణుబాంబును ఉపయోగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అణుబాంబుతో గుజరాత్లతోని సూరత్లో దాడి చేయడానికి స్కెచ్ గీశారు. ఈ విషయాన్ని ఐఎం ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడించాడు.
వరుస పేలుళ్లతో ఇప్పటికే మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు అణు పేలుళ్లతో నగరాలకు నగరాలనే శ్మశాన దిబ్బలుగా మార్చేందుకు వ్యూహ రచన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 27న భత్కల్ను భారత్ - నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

విచారణ సందర్భంగా భత్కల్ అత్యంత కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది. తనకో చిన్న అణుబాంబును పంపించగలవా అని పాకిస్థాన్లోని తమ బాస్ రియాజ్ భత్కల్ను ఫోన్లో అడిగానని, పాకిస్థాన్లో దేనినైనా సమకూర్చవచ్చు అని రియాజ్ జవాబిచ్చాడని, సూరత్లో దాడికి తనకొక అణుబాంబును పంపించాలని కోరానని, అణుబాంబు పేలుళ్లతో ముస్లిములు కూడా చచ్చిపోతారు కదా అని రియాజ్ ఆందోళన వ్యక్తం చేశాడని యాసిన్ చెప్పాడు.
ప్రతి ముస్లిం కుటుంబం కూడా చడీ చప్పుడు చేయకుండా, ఎవరికీ ఏమీ చెప్పకుండా నగరం విడిచి వెళ్లిపోండని మనం మసీదులన్నిటిలోనూ పోస్టర్లు అంటిద్దామని తాను జవాబిచ్చానని యాసిన్ భత్కల్ చెప్పినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications