నితీశ్ నేతృత్వంలోనే బీహర్ ప్రగతి, మరో ఛాన్స్ ఇవ్వండి..ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ
బీహర్ మూడో విడత ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలను గుప్పించాయి. అయితే గురువారం ప్రధాని నరేంద్ర మోడీ బీహరీలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే తిరిగి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అభిప్రాయపడ్డారు. అరాచకత్వం మధ్య సంస్కరణలు అమలు కావు అని విపక్షాలను ఉద్దేశించి కామెంట్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే నితీశ్ కుమార్ని తిరిగి గెలిపించాలని కోరారు.
ఈ సారి బీహర్ ప్రచార పర్వం మరింత ఊపందుకొంది. విజయం కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను ప్రయోగించాయి. అయితే ఇవే తన చివరి ఎన్నికలు అని నితీశ్ కుమార్ పున్రియా ప్రచార ర్యాలీలో అన్నారు. అయితే ఆ కామెంట్లను పార్టీ ఖండించింది. నితీశ్ నేతృత్వంలో పార్టీ కొనసాగుతోందని స్పష్టంచేసింది. మరోవైపు చిరాగ్ పాశ్వాన్ నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో జేడీయూ ఓడిపోవడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో మహిళలు, యువత ఎన్డీఏ వెంట ఉన్నారని మోడీ విశ్వాసంతో ఉన్నారు. వారికి ఎన్డీఏ సుపరిపాలన అందిస్తోందని ధీమాతో ఉన్నారు. ప్రతీ బీహరీ ఆకలితో ఉండొద్దనేదే తమ విధానం అని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తర్వాత మరోసారి బహిరంగ లేఖ రాసి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మరీ బీహరీలు తమ తీర్పుతో ఏం చెబుతారో చూడాలీ మరీ.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications