నితీశ్ నేతృత్వంలోనే బీహర్ ప్రగతి, మరో ఛాన్స్ ఇవ్వండి..ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ

బీహర్ మూడో విడత ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలను గుప్పించాయి. అయితే గురువారం ప్రధాని నరేంద్ర మోడీ బీహరీలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే తిరిగి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అభిప్రాయపడ్డారు. అరాచకత్వం మధ్య సంస్కరణలు అమలు కావు అని విపక్షాలను ఉద్దేశించి కామెంట్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే నితీశ్ కుమార్‌ని తిరిగి గెలిపించాలని కోరారు.

ఈ సారి బీహర్ ప్రచార పర్వం మరింత ఊపందుకొంది. విజయం కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను ప్రయోగించాయి. అయితే ఇవే తన చివరి ఎన్నికలు అని నితీశ్ కుమార్ పున్‌రియా ప్రచార ర్యాలీలో అన్నారు. అయితే ఆ కామెంట్లను పార్టీ ఖండించింది. నితీశ్ నేతృత్వంలో పార్టీ కొనసాగుతోందని స్పష్టంచేసింది. మరోవైపు చిరాగ్ పాశ్వాన్ నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో జేడీయూ ఓడిపోవడం ఖాయమన్నారు.

Bihar Assembly Election 2020: Need Nitish Kumar govt to ensure development in state: PM Modi

రాష్ట్రంలో మహిళలు, యువత ఎన్డీఏ వెంట ఉన్నారని మోడీ విశ్వాసంతో ఉన్నారు. వారికి ఎన్డీఏ సుపరిపాలన అందిస్తోందని ధీమాతో ఉన్నారు. ప్రతీ బీహరీ ఆకలితో ఉండొద్దనేదే తమ విధానం అని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తర్వాత మరోసారి బహిరంగ లేఖ రాసి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మరీ బీహరీలు తమ తీర్పుతో ఏం చెబుతారో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+