బీహార్ టాపర్స్ స్కాంలో వింత: 23 ఏళ్లకే పీహెచ్డీ
పాట్నా: బీహార్ టాపర్స్ స్కాంలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. బీహార్ స్కూల్ ఎగ్జాజిమినేషన్ బోర్డు మాజీ ఛైర్మన్ లోకేశ్వర్ ప్రసాద్ సింగ్ భార్య హిల్సా జేడీయు మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది.
2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ద్వారా మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ అఫడవిట్ ప్రకారం ఆమె 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేయడం విశేషం. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించే నాటికి ఆమె వయసు 49 సంవత్సరాలుగా పేర్కొంది.

దీంతో పాటు బీహార్లోని అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీని 1976లో ప్రారంభిస్తే, రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఆమె ఒకే ఏడాదిలో ఎలా పూర్తి చేశారనే విషయం అంతుచిక్కడం లేదు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉషా సిన్హా తన పీహెచ్డీని మగధ్ యూనివర్సిటీలో 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లో హిందీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేసిన టాపర్స్ స్కాంలో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది.

-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications