రైల్ లేటైతే ఎస్ఎంఎస్ వస్తుంది: 1,373రైళ్లకు సదుపాయం
న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు భారత రైల్వే మరో ప్రత్యేక సేవను అమలు చేయనుంది. ఇకపై ఒక గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ప్రయాణీకులకు రైల్వే శాఖ ముందుగానే చేరవేయనున్నట్లు తెలిపింది.
గరీభ్ రథ్, దురంతో, జన శతాబ్ది, సువిధ, హంసఫర్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో సహా మొత్తం 1373 రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఈ రైళ్ల రాక గంట కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎస్ఎంఎస్ల రూపంలో ముందుగానే ప్రయాణీకులకు సమాచారం అందిస్తామని చెప్పింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు రైళ్ల రాక విషయంలో ఆందోళన చెందాల్సిన పని ఉండదు.












Click it and Unblock the Notifications