viral video:వావ్.. మురికినీటిలో సేదతీరుతున్న గజరాజులు
నిప్పుల కొలిమిని తలపిస్తోంది పరిస్థితి. ఉదయం లేవగానే కాస్త చల్లగా ఉంటుంది.. ఆ తర్వాత వేడిమి.. అదీ కాస్త సాయంత్రం వరకు ఉంటుంది. తర్వాత కూడా వేడి గాలి.. రాత్రి 8 అయితే తప్ప చల్లని గాలి రాదు. జనం అయితే ఇంట్లో ఫ్యానో.. కూలర్ కింద సేదతీరుతారు. మరీ జంతువుల సంగతి ఏంటీ.. ఆలోచన చేయడానికి ఇబ్బందిగా ఉంది. మరీ అవీ ఎలా సేద తీరాలి.. గజరాజులా సంగతి ఏంటీ.. ఈ అయితే ఈ స్టోరీ చదవండి.
ఉక్కపోతతో జీవులు అల్లాడి పోతున్నాయి. దేశంలో రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అయితే గజరాజులో అయితే బురదగుంటలో పడ ఉన్నాయి. వేడి నుంచి తప్పించుకోవడానికి అవి అలా చేశాయి. దీనిని కొందరు వీడియో తీసి షేర్ చేశారు. ఈ వీడియో రాస్ గోవింద్ పూర్ ఫారెస్ట్ రేంజ్ నుంచి తీశారు. ఇదీ ఒడిశాలో గల మయూర్ బంజ్.. బరిపడ డివిజన్లో ఉంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్వాన్ దీనిని షేర్ చేశారు. సమ్ ఫన్ అనే క్యాప్షన్ జోడించారు. వేడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాయో చూడండి అని రాసుకొచ్చారు.

ఇలా చేయడం వల్ల అవీ చల్లబడతాయని వివరించారు. ఇలా చేయడంతో చెమట రాదని.. ఉపశమనం పొందొచ్చు అని చెప్పారు. అయితే మురికినీటిలో మునిగే సమయంలో. . చెవులు చాలా ముఖ్యం అని.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ వీడియోకు ఇప్పటికే 48 వేల వ్యూస్ వచ్చాయ. 3200 లైకులు వచ్చాయి. చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాశ్వాన్కు ట్విట్టర్లో మంచి ఫాలొయింగ్ ఉంది. అతనికి 3.8 లక్షల మంది ఫాలొవర్లు ఉన్నారు. అందుకే వీడియోను తెగ చూశారు. అదీ కాస్త వైరల్గా మారింది.
Some fun. This is how they are killing the heat !! pic.twitter.com/rcChYfWChy
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 2, 2022
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎండ ప్రభావం/ ఉక్కపోత ఉంటుంది. ఇప్పుడు వాన కురిసిన భూమి తడవదు. దాంతో ఉపయోగం ఉండదు. భూమి నుంచి మరింత వేడి రావడంతో.. ఉక్క పోత తప్పదు. అందుకే మూగ జీవాలు చెట్లు, పుట్టల కింద ఉంటున్నాయి. గజరాజులు అయితే ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ వాలుతున్నాయి.












Click it and Unblock the Notifications