శారదా స్కామ్: కాల్చుకుని మాజీ డిజిపి ఆత్మహత్య?
న్యూఢిల్లీ: శారదా కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న అస్సాం మాజీ డిజిపి శంకర్ బారువా మరణించారు. గౌహతిలోని తన నివాసంలో ఆయన బుధవారం మరణించి కనిపించారు. బహుశా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అంటున్నారు.
శంకర్ బారువా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రివాల్వర్తో కాల్చుకుని ఉంటాడని వార్తలు వచ్చాయి. శారదా స్కామ్కు సంబంధించిన సిబిఐ అధికారులు రెండు వారాల క్రితం శంకర్ బారువా ఇంటిలో సోదాలు నిర్వహించారు.

సిబిఐ అధికారులు గౌహతిలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో శంకర్ బారువా నివాసంలో కూడా సోదాలు జరిపారు. బారువాను సిబిఐ అధికారులు ప్రశ్నించారు కూడా. బారువా రివాల్వర్తో కాల్చుకుని మరణించినప్పుడు ఆయన 90 ఏళ్ల వయస్సు గల తల్లి ఇంట్లోనే ఉందని చెబుతున్నారు.
నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న బారువా బుధవారంనాడే ఇంటికి తిరిగి వచ్చారు. విచారణలో సిబిఐ అధికారులు అవమానించినందుకు మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శారద చిట్ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ 48 కేసులు నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లో నాలుగు కేసులు, ఒడిషాలో 44 కేసులు నమోదు చేసింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications