నలుగురు జడ్జీల తిరుగుబాటు: మాజీ జడ్జీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నలుగురు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాసినవారిలో ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాగా, మరో ముగ్గురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు. కేసుల కేటాయింపుల హేతుబద్దంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారుర ప్రధాన న్యాయమూర్తిని కోరారు.

ముఖ్యమైన, సున్నితమైన కేసుల విషయంలో అధికార దుర్వినియోగం జరగడం లేదని ప్రజలకు నమ్మకం కలిగించాలని వారన్నారు. కేసుల కేటాయింపులు జూనియర్ న్యాయమూర్తులు గల కొన్ని బెంచీలకు మాత్రమే జరగకూడదని, కేసుల కేటాయింపులో అటువంటి వివక్ష ఉండకూడదని వారన్నారు.
రిటైర్డ్ న్యాయమూర్తులు పిబి సావంత్, ఎపి షా, కె చంద్రు, హెచ్ సురేష్ ఆ బహిరంగ లేఖ రాశారు. తమ బహిరంగ లేఖను వారు మీడియాకు అందించారు. మాజీ న్యాయమూర్తులతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు జస్టిస్ షా ధ్రువీకరించారు.
లేఖలో తాను చెప్పిన అంశాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన అన్నారు సమస్య పరిష్కారం కావాలని, బెంచీల కేటాయింపు, కేసుల పంపిణీకి నిర్దిష్టమైన నిబంధనలను రూపొందించాలని నలుగురు మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో అన్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications