బిజెపికి షాక్: ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావు: ఈసీ
గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటుచేసుకొన్న రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకొంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయంటూ ఎన్నికను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్ను క
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటుచేసుకొన్న రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకొంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయంటూ ఎన్నికను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్ను కొనసాగించాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా బ్యాలెట్ పేపర్లను తెచ్చి ఓట్లు వేశారని వారి ఓట్లను చెల్లనివిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
అయితే ఈ విషయమై కాంగ్రెస్, బిజెపిలు మూడు దఫాలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. తమ తమ వాదనలను విన్పించారు. అయితే ఈ వాదనలను విన్న తర్వాత మంగళవారం నాడు అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి ఓటు చేశారు. బోలాబాయ్ గోహిల్, రాఘవ్బాయ్ పటేల్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్పటేల్కు కాకుండా బిజెపికి ఓటు చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 176 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే ఇద్దరి ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు చేరుకొంది. 44 ఓట్లు వస్తే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవుతారు.
ఈసీ నిర్ణయంతో అహ్మద్పటేల్ మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలారు. అయితే ఈ నిర్ణయం బిజెపికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications