హర్దిక్ పటేల్ మీద దోపిడి కేసు పెట్టారు
సూరత్: పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్ మీద కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని వీలైతే అన్ని కేసులు నమోదు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాగుజరాత్ పోలీసులు మాత్రం వారి పని వారు చేసుకు వెళుతున్నారు.
హర్దిక్ పలేట్ మీద ఇప్పుడు దోపిడి కేసు నమోదు చేశారు. 2015 జులై 23వ తేదీన విస్ నగర్ పట్టణంలో హర్దిక్ పటేల్ సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా ర్యాలీతో పాటు పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అదే సందర్బంలో విధ్వంసం చోటు చేసుకోవడంతో దోపిడీలు జరిగాయి.
ఈ ఘటనకు హర్దిక్ పటేల్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని మీద పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే హర్దిక్ పటేల్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

అక్టోబర్ 3వ తేదిన సూరత్ లో రిజర్వేషన్ల కోసం ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరం అయితే పోలీసులను చంపడంటూ హర్దిక్ పటేల్ అతని వర్గానికి చెందిన యువకులకు పిలుపునిచ్చాడని సూరత్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే సూరత్ పోలీసులు దేశద్రోహం కింద హర్దిక్ పటేల్ మీద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా మెహసానా జిల్లాలో హర్దిక్ పటేల్ మీద పలు కేసులు నమోదు చేశారు. పటేల్ రిజర్వేషన్ల కోసం ఎన్ని కేసులు పెట్టినా భయపడను అని హర్దిక్ పటేల్ ఇంతకు ముందే పలు సార్లు చెప్పాడు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications