సర్జికల్ స్ట్రైక్ : ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ లో వీక్షించింది ఆ ముగ్గురే!
న్యూఢిల్లీ : 'సర్జికల్ స్ట్రైక్స్'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు అందరి నోళ్లలోను నానుతోన్న పేరు. పాక్ పై భారత సైన్యం చేపట్టిన ఈ చర్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగాను చర్చనీయాంశంగా మారింది. అత్యంత పకడ్బందీగా.. పక్కా స్కెచ్ గీసి మరీ ఈ ఆపరేషన్ ను నిర్వహించడం పట్ల.. అటు ఇండియన్ ఆర్మీతో పాటు ఇటు ఆపరేషన్ కు దిశా నిర్దేశం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ బల్బీర్ సింగ్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నియంత్రణ రేఖ నుంచి 3 కి.మీ చొచ్చుకెళ్లిన సైనికులు.. 40 మంది ఉగ్రవాదులతో పాటు 8 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఆపరేషన్ కు డైరెక్షన్స్ ఇచ్చిన అజిత్ దోవల్, బల్బీర్ సింగ్ తో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ లైవ్ లో వీక్షించార్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి బుధవారం నాడు ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ లో జరిగిన డిన్నర్ పార్టీకి ఈ ముగ్గురు హాజరుకావాల్సి ఉన్నా.. పాక్ పై చేయబోతున్న సర్జికల్ స్ట్రైక్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీకి గైర్హాజరయ్యారు. అదే సమయంలో సర్జికల్ స్ట్రైక్ ను అమలు చేయాల్సిన తీరు.. అనుసరించాల్సిన వ్యూహంపై ముగ్గురి మధ్య చాలాసేపు చర్చ నడిచినట్టు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ మొత్తాన్ని ఈ ముగ్గురు లైవ్ లో వీక్షించడానికి కూడా ఏర్పాట్లు జరిగాయట. ప్రత్యేక డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ ద్వారా ఈ ముగ్గరు వీక్షించినట్టు సమాచారం.

బుధవారం రాత్రి 12.30గం.ల ప్రాంతంలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ ను ప్రారంభించగా.. అంతకు నాలుగు గంటల ముందే ఆపరేషన్ కు సంబంధించిన సన్నాహాకాలను పూర్తి చేసుకుని సరైన సమయం కోసం వేచి చూసినట్టుగా సమాచారం. ఇకపోతే సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించింది టార్గెట్స్ ఫిక్స్ చేయడం దగ్గరి నుంచి.. దాడులు ఎలా చేయాలన్న అంశాలపై అజిత్ దోవల్ సూచించిన వ్యూహాలనే అనుసరించారట. పాక్ లో దాదాపు ఏడేళ్లపాటు అండర్ కవర్ లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో ఆపరేషన్ వ్యవహారం మొత్తం ఆయన డైరెక్షన్ లోనే సాగినట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఆపరేషన్ ను షురూ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాత్రం రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అని తెలుస్తోంది. ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీ రక్షణశాఖ జాగ్రత్తగా భద్రపరిచినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో ఈ వీడియో బయటకు వస్తుందా..? రాదా? అన్నది అనుమానమే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications