రైల్వే ప్రైవేటీకరణ.. అబ్బే అదేం లేదే, పార్లమెంట్లో మంత్రి పీయూష్ గోయల్
కీలక రంగాలను ప్రైవేటీకరిస్తుపోతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అనడంతో అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ సెక్టార్లో కీలకం ఎయిర్ ఫోర్స్, రైల్వే.. రైల్వేలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల రైల్వే ప్రైవేటీకరణ అంశం గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది. తాజాగా ఇవాళ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
రైల్వేను ప్రైవేటీకరించబోమని గోయల్ తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ అనే మాటకు తావులేదని చెప్పారు. అయితే ప్రైవేట్ సంస్థలను మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పారు. ఇదీ రైల్వే పనితీరు కోసమేనని చెప్పారు. రైల్వే గ్రాంట్లుల గురించి సభ్యులు పట్టుబట్టగా పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో ఒక్క ప్రయాణికుడు కూడా రైలు ప్రమాదంతో చనిపోలేదని సభకు వివరించారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యం అని పీయూష్ గోయల్ తెలిపారు.

దేశం వృద్ది సాధించే క్రమంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రెండింటిలో ఉపాధి అవకాశాలు ముఖ్యమని చెప్పారు. భారతీయ రైల్వే ప్రతీ ఒక్క భారతీయుడి ఆస్తి అని.. దాని ప్రైవేటీకరణ అనే మాటకు తావులేదని చెప్పారు. ప్రభుత్వంలో రైల్వే ఎప్పుడూ అంతర్భాగమేనని చెప్పారు. రైల్వే కేటాయింపులను మోడీ ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. 2019-20లో అదీ 1.5 లక్షల కోట్లు ఉంటే.. 2021-22లో అదీ 2.15 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications