ప్రపంచ వారసత్వ నగరంగా పింక్ సిటీ జైపూర్...యూనెస్కో ప్రకటన
న్యూఢిల్లీ: శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గుర్తింపు పొందిన 17 పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయి డెస్టినేషన్గా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఒకరోజులోనే రాజస్థాన్లోని జైపూర్కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. జైపూర్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రకటన చేసింది.
🔴 BREAKING
— UNESCO (@UNESCO) July 6, 2019
Just inscribed as @UNESCO #WorldHeritage Site: Jaipur City in Rajasthan, #India 🇮🇳. Bravo 👏
ℹ️ https://t.co/thV0mwrj0X #43WHC pic.twitter.com/NU4W32dy3x
ఇదే విషయాన్ని తెలుపుతూ యూనెస్కో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.యూనెస్కో ట్వీట్ను ప్రధాని నరేంద్ర మోడీ కూడా షేర్ చేశారు. జైపూర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ నగరం సంస్కృతికి శౌర్యానికి పెట్టింది పేరు అని ప్రధాని కొనియాడారు. జైపూర్ నగరం ఎంతో అందంగా ఉండటంతో పాటు చాలా శక్తివంతమైన నగరంగా మోడీ పేర్కొన్నారు. అంతేకాదు ఆతిథ్యం ఇవ్వడంలో ఈ నగరంతో ఏ నగరం పోటీపడలేదని అన్నారు. ప్రపంచ దేశాలనుంచి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే నగరం జైపూర్ అని మోడీ తన ట్వీట్లో తెలిపారు. ఇంతటి చరిత్ర ఉన్న జైపూర్ నగరాన్ని యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తించినందుకు అభినందనలు తెలియజేశారు.

జైపూర్ సిటీని పింక్ సిటీగా కూడా పిలుస్తారు. ఈ నగరంలో పలు పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇందులో అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, మరియు హవా మహల్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ఇక యూనెస్కో గుర్తించిన ఇతర వారసత్వ సంపద నగరాల్లో బహ్రెయిన్లోని దిల్మన్ బరియల్ మౌండ్స్, ఆస్ట్రేలియాలోని బుడ్జ్బీమ్ కల్చరల్ ల్యాండ్స్కేప్, చైనాలోని ఆర్కియలాజికల్ రూయిన్స్ ఆఫ్ లియాంగ్జు సిటీ, ఇండోనేషియలోని ఓంబిలిన్ కోల్ మైనింగ్ హెరిటేజ్ ఆఫ్ సవ్హాలున్తో, కోఫన్ గ్రూప్కు చెందిన ఫురుచీ, జపాన్ నగరాలు ఉన్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications