సీఎం సిద్దరామయ్యకు చాముండేశ్వరీలో ఎదురు దెబ్బ, బాదామిలో శ్రీరాములుతో నువ్వానేనా, ఢీ!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో ప్రత్యర్థి, స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ దెబ్బకు వెనకబడిపోయారు.
శ్రీరాములుతో ఢీ
బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములుకు సీఎం సిద్దరామయ్య గట్టిపోటీ ఇస్తున్నారు. బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బి. శ్రీరాములు నువ్వానేనా అంటు ఓట్ల లెక్కింపులో పోటీపడుతున్నారు.
సీఎం సిద్దూకు సినిమా
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు 5వ రౌండ్ లో 12,960 ఓట్లు వచ్చాయి. సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేసిన స్థానిక ఎమ్మెల్యే, జేడీఎస్ అభ్యర్థి జీటీ. దేవేగౌడకు 17,356 ఓట్లు వచ్చాయి. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య వెనకబడిపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
బాదామిలో సీఎం సిద్దూ
బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రజలు అంచనా వెయ్యలేకపోతున్నారు.
జేడీఎస్ ధీమా
కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటూ పోటీ పడుతుండంతో ఇటు జేడీఎస్ మాత్రం మేములేకుండా మీరెవ్వరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అంటోంది. కర్ణాటకలో ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా జేడీఎస్ పార్టీ కీలకంగా మారనుంది.
సీఎం ఓడిపోతారు
చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో అందరూ అనుకున్నట్లే సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని సమాచారం. స్థానిక ఎమ్మెల్యే, జేడీఎస్ నాయకుడు జీటీ. దేవేగౌడ సీఎం సిద్దరామయ్యకు సినిమా చూపిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య స్థానిక ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.