నీరవ్ మోడీ ఎఫెక్ట్: ఎల్ఓయూ, ఎల్ఓసీలకు స్వస్తి చెప్పిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్బిఐ దిద్దుబాటు చర్యలను తీసుకొంటుంది. ట్రేడ్ క్రెడిట్ కింద ఇచ్చే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ), లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)లకు స్వస్తి పలుకుతున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
బ్యాంక్ ఉద్యోగులతో కుమ్మక్కై తప్పుడు ఎల్వోయూలతో నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలు రూ.12,700 కోట్ల మేర దోపిడీకి పాల్పడి విదేశాలకు చెక్కేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత దిగుమతిదారులకు ఆథరైజ్డ్ డీలర్ కేటగిరి బ్యాంక్-1లు వ్యాపార రుణం కింద ఎల్వోయూ, ఎల్వోసీల జారీని నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటించింది.
ఎల్వోయూలు, ఎల్వోసీలు విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కీలకమైనవి. సదరు వ్యాపారస్థులకు విదేశాల్లోని ఇతర భారత బ్యాంకుల బ్రాంచీలకు హామీలను సమకూరుస్తాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications