నీరవ్ మోడీ ఎఫెక్ట్: ఎల్ఓయూ, ఎల్ఓసీలకు స్వస్తి చెప్పిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్బిఐ దిద్దుబాటు చర్యలను తీసుకొంటుంది. ట్రేడ్ క్రెడిట్ కింద ఇచ్చే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ), లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)లకు స్వస్తి పలుకుతున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
బ్యాంక్ ఉద్యోగులతో కుమ్మక్కై తప్పుడు ఎల్వోయూలతో నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలు రూ.12,700 కోట్ల మేర దోపిడీకి పాల్పడి విదేశాలకు చెక్కేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత దిగుమతిదారులకు ఆథరైజ్డ్ డీలర్ కేటగిరి బ్యాంక్-1లు వ్యాపార రుణం కింద ఎల్వోయూ, ఎల్వోసీల జారీని నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటించింది.
ఎల్వోయూలు, ఎల్వోసీలు విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కీలకమైనవి. సదరు వ్యాపారస్థులకు విదేశాల్లోని ఇతర భారత బ్యాంకుల బ్రాంచీలకు హామీలను సమకూరుస్తాయి.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications