కాలేజీ అమ్మాయిలను ప్రలోభపెట్టా, వారి కోసమే: నిర్మలాదేవి
చెన్నై: సస్పెండైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి అమ్మాయిలను ప్రలోభ పెట్టేదని సీబీసీఐడీ మద్రాస్ హైకోర్టులో రిపోర్ట్ను దాఖలు చేసింది. తాను విద్యార్థులను ప్రలోభపెట్టిన మాట నిజమేనని స్వయంగా ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీసీఐడీ పేర్కొంది.
అరుప్పుకోట దేవాంగర్ కళాశాల సహాయ ఆచార్యురాలు నిర్మలాదేవి, సహాయ ఆచార్యుడు మురుగన్, పీజీ విద్యార్థి కరుప్పస్వామి తదితరులు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసును సీబీసీఐడీకి బదులు మహిళా డీఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన న్యాయస్థానం ఈ కేసు విచారణ ప్రస్తుతస్థితి గురించి నివేదిక అందించాలని సీబీసీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ అధికారి నివేదిక దాఖలు చేశారు. అందులో నిర్మలాదేవి, మురుగన్, కరుప్పస్వామిలు విద్యార్థినులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన మాట నిజమేనని నిర్మలాదేవి వాంగ్మూలం ఇచ్చిందన్నారు.
మురుగన్, కరుప్పస్వామి కోసమే ఈ పని చేసినట్లు ఆమె చెప్పారని తెలిపారు. విద్యార్థినులతో నిర్మలాదేవి ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇంతవరకు 160 మందిని విచారించినట్లు తెలిపారు. ముగ్గురి ఇళ్ల నుంచి సిమ్ కార్డులు, మెమొరీ కార్డులు, లాప్ట్యాప్ తదితర ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ పరిశోధనలు చేశామని, త్వరలో విచారణ ముగుస్తుందన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications