'జన్ ధన్ , బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు'
బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు, జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస నగదు నిల్వ చేయాల్సిన అవసరం లేదని ఎస్ బి ఐ చైర్మెన్ అరుంధతీ రాయ్ చెప్పారు. నిబంధనలు సరిగా చదవని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ముంబై: ఈ ఏడాది ఏప్రిల్ 1వ, తేది నుండి అమల్లొకి తీసుకురానున్న కనీస బ్యాలెన్స్ నిబంధనలపై ఎస్ బి ఐ బ్యాంకు చైర్మెన్ అరుంధతి భట్టాచార్య మరోసారి వివరణ ఇచ్చారు.ఇతర బ్యాంకుల్లో చాలా వరకు తాము అమలు చేయాలనుకొన్న నిబంధలను కొనసాగిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
బేసిక్ సేవింగ్ బ్యాంకు , జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస నిల్వ నిబంధనలు వర్తించవని ఆమె చెప్పారు. ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించబోవని ఆమె ప్రకటించారు.

నిబంధనలను సరిగా చదవని వారే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల సంఖ్యను పెంచుకొనేందుకుగాను 2012 లో కనీస నగదు నిల్వ నిబంధనను ఎస్ బి ఐ ఎత్తివేసింది.
ఈ నిబంధనను ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమలు చేయనుంది.ఏప్రిల్ నుండి అమలు చేయనున్న నిబంధనలపై బ్యాంకులు వెనక్కి తగ్గేలా కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఏదేమైనా కొత్తగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టిన నిరుపేదలకు కనీస మొత్తం నుండి మినహయింపు ఉండడంతో అత్యధికులుగా ఉన్న చిరు వినియోగదారులపై ప్రభావం లేనట్టేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications