నిర్మలాదేవి కేసు: పోలీసుల చేతికి ఎస్ఎంఎస్లు, సెలబ్రేషన్స్, విచారణ ప్రారంభం
Recommended Video
చెన్నై: విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దించేందుకు ప్రోత్సహించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్ నిర్మలాదేవి విషయమై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఎఎస్ సంతానం విచారణ ప్రారంబించారు. తమిళనాడు గవర్నర్ ప్రోఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంపై నిజాలను తేల్చేందుకు సంతానం కమిటీని ఏర్పాటు చేశారు. రెండు వారాల్లోపుగా నివేదికను ఇవ్వాలని కమిటీని గవర్నర్ ఆదేశించారు.
విద్యార్ధినులకు నిర్మలాదేవి గాలం, మెబైల్స్ నిండా ఆ చిత్రాలే, సంతానం కమిటి విచారణ
విద్యార్ధినులను పడువు వృత్తిలోకి ప్రోత్సహించిందని ప్రోఫెసర్ నిర్మలాదేవిపై ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు తనకు చాలా పెద్దవారితో కూడ పరిచయాలున్నాయని ఆమె విద్యార్ధినులను బెదిరింపులకు పాల్పడేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ప్రోఫెసర్ నిర్మలాదేవి ఎవరో తనకు తెలియదని తమిళనాడు గవర్నర్ కూడ ప్రకటించారు. ఈ విషయమై వాస్తవాలను వెలికి తీయాలని రిటైర్డ్ సంతానం కమిటీని ఆయన ఆదేశించారు.
సంతానం కమిటి విచారణ ప్రారంభం
విద్యార్ధినులను పడువు వృత్తిలోకి ప్రేరేపించిందనే విషయమై ప్రోఫెసర్ నిర్మలాదేవి ఉదంతంపై ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఎఎస్ సంతానం కమిటి గురువారం నాడు విచారణను ప్రారంభించింది. చెన్నై నుంచి మదురై వెళ్లిన సంతానం అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేసి మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను క రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం విచారించారు.విద్యార్థినులతో నిర్మలాదేవి సెల్ఫోన్ సంభాషణను పరిశీలించారు.
పది నెలల్లో 200 ఉత్సవాలు
మద్యం, జల్సా పార్టీలతో మదురై కామరాజ్ యూనివర్సిటీ కేళీవిలాసాల్లో మునిగితేలుతున్నట్లు విచారణ కమిషన్కు కొందరు ఫిర్యాదు చేశారు. పదినెలల్లో 200 ఉత్సవాలు, 60 మెగా పార్టీలు నిర్వహించగా కేవలం జీడిపప్పు కొనుగోలుకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. . ఈ కేసు విచారణకు ఏడు బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, నిర్మలాదేవి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
యూనివర్శిటీలో వేర్వేరుగా విచారణ
ఈనెల 21వ తేదీన యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను , నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని వేర్వేరుగా విచారించనున్నారు. ,గవర్నర్ నియమించిన కమిషన్ విచారణ ప్రారంభమైందని విచారణకు పూర్తి సహకరిస్తున్నామని యూనివర్శిటీ వైస్ ఛాన్సిలర్ చెల్లదురై ప్రకటించారు. మరోవైపు సంతానం కమిటికి ఇద్దరు మహిళా ప్రోఫెసర్లు విచారణ కమిటిలో చేరారు. విద్యార్ధినులతో మాట్లాడేందుకు ఈ మహిళా ప్రోఫెసర్లను కమిటిలో చోటు కల్పించారు. అయితే ఏప్రిల్ 20న నిర్మలాదేవి పనిచేసిన కాలేజీలో విచారణ చేయనున్నట్టు సంతానం ప్రకటించారు. ఏప్రిల్ 21న లేదా ఏప్రిల్ 23న, జైలులో ఉన్న ప్రోఫెసర్ నిర్మలాదేవిని తాను కలవనున్నట్టు సంతానం తెలిపారు.
నిర్మలాదేవిపై ఫిర్యాదు చేసిన విద్యార్ధినులు
నిర్మలాదేవికి సంబంధించి 26 పేజీలతో కూడిన ఆధారాలను కొందరు విద్యార్థినులు అరుప్పుకోట్టై పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. లైంగిక కార్యకలాపాలకు అంగీకరించాల్సిందిగా కోరుతూ ఆమె పంపిన ఎస్ఎమ్ఎస్లను 20 పేజీలపై ముద్రించి అందజేసినట్లు సమాచారం.ఈ ఎస్ఎంఎస్ల ఆధారంగా పోలీసులు విచారణ చేయనున్నారు.