గుజరాత్ తీరంలోకి వచ్చిన పాక్ పడవ: రూ. 600కోట్ల హెరాయిన్ సీజ్
గాంధీనగర్: పాకిస్థాన్కు చెందిన ఓ పడవ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ తీరంలోకి చేరుకుంది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ పడవను భారత నావికా దళం సోమవారం గుర్తించింది. ఆ పడవను పోర్బందర్కు తీసుకెళ్లిన నావికా దళం విచారణ జరుపుతోంది.
కాగా, ఆ పడవలో 100 కిలోల హెరాయిన్ ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పడవలో 8మంది మత్తు పదార్థాలను సరఫరా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
అనుమానాస్పదంగా తిరుగుతున్నందునే అదుపులోకి తీసుకోవడం జరిగిందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. భారత జలాల్లో ఆ పడవ ఎందుకు సంచరిస్తుందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. విచారణ అనంతరం పూర్తి వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

గత రెండు మూడు రోజులుగా రెండు నేవీ నౌకలు, ఓ కోస్ట్ గార్డ్ నౌక సదరు పడవను గమనించినట్లు తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకే ఆ పడవ భారత జలాల్లోకి వచ్చిందా? అనే కోణంలో నేవీ విచారణ కొనసాగిస్తోంది. భారత జలాల్లోకి రావడంతో పడవను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ తీరంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఇలాంటి పడవలను పంపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 31, 2014లో కూడా ఓ పడవ గుజరాత్ తీరం సమీపంలోకి వచ్చి భారత నేవీ వెంబడించడంతో పడవను పేల్చుకున్న విషయం తెలిసిందే.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications