కేజ్రీవాల్ కు షాక్: ''రూ.97 కోట్లు కట్టాల్సిందే''
న్యూఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్ జీ అనిల్ బైజల్ తోనూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తలనొప్పులు తప్పేలా కన్పించడం లేదు.ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రూ.97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్ జీ అనిల్ బైజల్ తోనూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తలనొప్పులు తప్పేలా కన్పించడం లేదు.ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రూ.97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని ఆయన చెప్పారు.ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.రూ.97 కోట్లు చెల్లించేందుకు పార్టీకి నెలరోజుల పాటు గడువు ఇచ్చింది.

ఈ ప్రకటనలన్నింటికీ రాష్ట్ర ఖజానానుండి డబ్బు చెల్లించారు.అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసులు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్టులేవు. అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రికి గానీ, ఉప ముఖ్యమంత్రికి గానీ ఈ నోటీసుల గురించి ఎలాంటి సమాచారం లేదని తమకు ఏమైనా సమాచారం వస్తే దీనిపై వ్యాఖ్యానిస్తామని ఆప్ పార్టీ వర్గాలు చెప్పాయి.
ప్రభుత్వ ప్రకటనలలో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోలు మాత్రమే ఉండాలని సుప్రీం కోర్టు 2016లో జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అసోం, పశ్చిమబెంగాల్ , తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టులను ఆశ్రయించాయి. దీని వల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థకు ముప్పు కలిగే అవకాశం ఉందని వాదించాయి.
దీంతో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రులు,గవర్నర్లు, మంత్రుల ఫోటోలను కూడ అనుమతిస్తామని చెప్పింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications