కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో యువకుడి దారుణ హత్య, రచ్చ, అడ్డుకున్నాడు, కత్తులతో!
బెంగళూరు: ప్రసిద్ది చెందిన కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో నగదు లూటీ చెయ్యడానికి వెళ్లిన దండగులు అమాయకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బెంగళూరులో ఉద్యోగం
ఒరిస్సాకు చెందిన సమీర్ (25) బెంగళూరు చేరుకుని హోసూరు జాతీయ రహదారిలోని హెబ్బగుడి సమీపంలోని కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో వెయిటర్ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి సమీర్ విధుల్లో ఉన్నాడు.

క్యాష్ కౌంటర్
ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బైక్ ల్లో అక్కడికి వెళ్లారు. తరువాత కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో చొరబడి భీభత్సం చేశారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదు, మొబైల్ లూటీ చెయ్యడానికి ప్రయత్నించారు. సమీర్ వారిని అడ్డుకోవడంతో సహనం కొల్పోయిన దుండగులు కత్తులతో అతని మీద దాడి చేశారు.

నగదు లూటీ
అనంతరం నగదు, మొబైల్ లాక్కొని అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలైన సమీర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై సమీర్ మరణించాడని హెబ్బగుడి పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాలు
బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిలో ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో హత్య జరగడంతో స్థానికులు హడలిపోయారు. కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications