ప్రద్యుమన్ హత్య ట్విస్ట్: ఆరోజు ఏం చేశానంటే?.. నిందితుడు చెప్పిన కొత్త విషయాలు
బాలల సంరక్షణ అధికారి నిందితుడితో మాట్లాడిన క్రమంలో.. హత్యా నేరాన్ని బాలుడు ఖండించినట్టు సమాచారం.తాను హత్య చేయలేదని నిందితుడు పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మొదట స్కూల్ బస్ కండక్టరే నిందితుడన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత 11వ తరగతి విద్యార్థే అసలు నిందితుడని సీబీఐ అధికారులు వెల్లడించారు.
కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో.. వాంగ్మూలంలోను హత్యా నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే బాలల సంరక్షణ అధికారి ఎదుట మాత్రం నిందితుడు మాట మార్చాడు.

నాకూ తమ్ముడున్నాడు:
నిందితుడి చేత బలవంతంగా వాంగ్మూలం చెప్పించారన్న ఆరోపణల నేపథ్యంలో.. బాలల సంరక్షణ అధికారి విచారణ తీరును పరిశీలించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు ఆయన నిందితుడి వద్దకు వెళ్లారు.
బాలల సంరక్షణ అధికారి నిందితుడితో మాట్లాడిన క్రమంలో.. హత్యా నేరాన్ని బాలుడు ఖండించినట్టు సమాచారం.తాను హత్య చేయలేదని నిందితుడు పేర్కొన్నాడు. అంతేకాదు, అధికారులు తనను కొట్టి, బలవంతపెట్టి ఒప్పించారని ఆరోపించాడు.
తనకూ ఒక తమ్ముడు ఉన్నాడని, తన తమ్ముడు లాంటి వాడిని ఎందుకు హత్య చేస్తానని నిందితుడు ప్రశ్నించడం గమనార్హం. దీంతో సీబీఐ అధికారులు షాక్ తిన్నారు. బాలుడు మాట మార్చడంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

టార్చర్ పెడుతున్నారు:
నిందితుడి తల్లిదండ్రులు సీబీఐ అధికారులు తమ కుమారుడిని చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. బలవంతంగా అతని చేత వాంగ్మూలం చెప్పించారని, తలకిందులుగా వేలాడదీసి హింసించారని తండ్రి ఆరోపించారు.
వాంగ్మూలంలో నిందితుడు వెల్లడించిన విషయాలకు, బాలల సంరక్షణ అధికారి ఎదుట వెల్లడించిన విషయాలకు అసలు పొంతన కుదరడం లేదు. ఘటన జరిగిన రోజు తానేం చేసింది వివరిస్తూ పలు కొత్త విషయాలు వెల్లడించాడు.

ఆరోజు ఇలా.. మ్యూజిక్ రూమ్ వైపు వెళ్లానని!
ఆరోజు మొదట గుడికి వెళ్లి తన నాయనమ్మకు శ్రాద్ద కర్మలు నిర్వహించానని నిందితుడు తెలిపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఉదయం 8గం.కు స్కూలుకు వెళ్లినట్టు పేర్కొన్నాడు. అయితే ఇంతలో ఓ స్నేహితుడు తనను ఆగమని చెప్పడంతో.. స్కూల్లోని వాటర్ కూలర్ వద్ద అతని కోసం వేచి చూసినట్టు చెప్పాడు.
అక్కడే రెండు నిముషాల పాటు తాను వేచి చూశానని, ఎంతకీ అతను రాకపోవడంతో పక్కనే ఉన్న మ్యూజిక్ రూమ్ వైపు వెళ్లానని చెప్పాడు. ఇటీవలే మ్యూజిక్ టీచర్ తన తండ్రిని కోల్పోవడంతో పరామర్శించడానికి వెళ్లినట్టు తెలిపాడు.

రక్తపు వాంతులు చేసుకున్నాడని
మ్యూజిక్ రూమ్ లాక్ చేసి ఉండటంతో అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లి మిత్రుడి కోసం చూశానని పేర్కొన్నాడు. అప్పటికీ మిత్రుడు రాకపోవడంతో వాష్ రూమ్ వైపు వెళ్లానని చెప్పుకొచ్చాడు. అక్కడ ఓ బాలుడు రక్తం వాంతులు చేసుకోవడం కనిపించిందన్నాడు. వెంటనే బయటకు పరిగెత్తుకొచ్చి తోటమాలి హర్పాల్ కు విషయం చెప్పానని అన్నాడు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications