'సిమ్ అవసరం లేదు, ఇక వైఫై బ్రాడ్ బ్యాండ్ తోనే ఫోన్ కాల్స్..'
న్యూఢిల్లీ: మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని చింతిస్తున్నారా?.. ఇకపై అలా చింతించాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్ ప్రతిపాదనలకు మంగళవారం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్రాడ్బ్యాండ్తో మొబైల్ ఫోన్లకు, ల్యాండ్లైన్స్ కు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి.
గత అక్టోబర్లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్బ్యాండ్తో ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రతిపాదనల నేపథ్యంలో ఇకనుంచి సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నంబర్స్ ను టెలికాం కంపెనీలు ఆఫర్ చేయనున్నాయి.
ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి ఆమోదం లభించడంతో.. రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది.
కాగా, ఈ కొత్త వైఫై ద్వారా ఫోన్ కాల్ సౌకర్యం అందుబాటులోకి రావడం యూజర్లకు ఎంతో మేలు చేస్తుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ సరిగా లేనప్పటికీ.. వైఫై విషయంలో మాత్రం ఆ ఢోకా ఉండదంటున్నారు. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్ది అయితే నెంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.