రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఊరట: శిక్ష ఏడేళ్లకు తగ్గింపు
న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం కదులుతున్న రైలులో అత్యాచారానికి గురై, ఆ తర్వాత రైలు నుంచి తోసివేయబడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య కేసు గుర్తుందా? ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామి అనే వ్యక్తికి కింది కోర్టులు మరణ శిక్ష విధించగా, దానిని ఏడేళ్లకు జైలు శిక్షకు తగ్గిస్తూ సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.
ఈ కేసుని ఒక్కసారి పరిశీలిస్తే... కేరళ రాజధాని కొచ్చిలోని ఓ షాపింగ్మాల్లో పనిచేసే సౌమ్య (24) 2011, ఫిబ్రవరి 1న రైలులో అత్యాచారానికి గురైంది. కేరళకు చెందిన సౌమ్య ఎర్నాకులం నుంచి త్రిశూర్కు రైలులో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలులోని మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సౌమ్యపై గోవిందచామి అత్యాచారం చేశాడు.
అనంతరం
కదులుతున్న
రైలు
నుంచి
ఆమెను
కిందకు
తోసేశాడు.
దీంతో
ఆసుపత్రిలో
చికిత్స
పొందుతూ
ఫిబ్రవరి
6న
సౌమ్య
మృతి
చెందింది.
ఈ
కేసులో
గోవిందచామి
దోషిగా
తేలడంతో
2012లో
త్రిశూర్లోని
ఫాస్ట్ట్రాక్
కోర్టు
గోవిందచామికి
మరణశిక్ష
విధించింది.
ఈ తీర్పును కేరళ హైకోర్టు కూడా సమర్థించి నిందితుడి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో కింది కోర్టుల తీర్పుపై నిందితుడు గోవిందచామి సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, గురువారం దీనిపై విచారణ జరిగింది. బాధితురాలు సౌమ్యపై గోవిందచామి అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్ రుజువుచేసింది.
Soumya was brutally assaulted and pushed off the train by the accused. The accused also jumped off the train and raped her, on Feb 1, 2011.
— ANI (@ANI_news) September 15, 2016
అయితే కుదలుతున్న రైలు నుంచి ఆమెను తోసేశాడని నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో హత్య కేసును పరిగణనలోనికి తీసుకోని సుప్రీం అతడికి మరణశిక్షను తగ్గించింది. అలాగే అత్యాచారం కేసు కింద గోవిందచామికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే అతడు ఐదు సంవత్సరాల ఏడు నెలల జైలుశిక్షను పూర్తిచేసుకున్నాడు. తాజాగా సుప్రీం తీర్పుతో మరో 16 నెలల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు.