ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీలు పెట్టిన ఖర్చెంతో తెలుసా?: సర్వే బయటపెట్టింది..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఏకంగా రూ. 5500కోట్లు ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది.
ఉత్తరప్రదేశ్: ఈరోజుల్లో రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అందుకే బడాబాబులకు టికెట్లు ఇచ్చి మరీ వారిచ్చే డబ్బుతో పార్టీలను నడిపిస్తుంటారు ఆయా పార్టీల అధినేతలు. ఇవిగాక పార్టీ కార్యక్రమాల కోసం నిధుల సేకరణ కూడా చేపడుతుంటారు.
ఇక ఎన్నికల సమయంలో అయితే పార్టీలు ఖర్చు పెట్టే డబ్బుకు అంతూ పొంతూ ఉండదు. అసలు లెక్కలు పైకి కనిపించకపోయినా.. వేల కోట్ల రూపాయల ధనప్రవాహం మాత్రం ఖాయం. తాజా యూపీ ఎన్నికల్లోనూ ఇదే విషయం మరోసారి స్పష్టమైంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఏకంగా రూ. 5500కోట్లు ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది. ఇందులో ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు రూ.వెయ్యి కోట్లు కాగా, భారీ ప్రచార సభల ఏర్పాట్లకు.. భారీ స్క్రీన్లు, వీడియో వ్యాన్లు, ఎలక్ట్రానిక్ మెటీరియల్, వంటి వాటికి రూ.4500కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
మొత్తం మీద ఒక్కో రాజకీయ పార్టీ రూ.600 నుంచి రూ.700కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సర్వే ద్వారా తెలిసింది. యూపీలో ఒక్కో ఓటు విలువ రూ.750ఉందని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికమని సర్వే పేర్కొంది. దేశంలో మూడింట ఒకవంతు ఓటర్లు ఓటుకు డబ్బు లేక మద్యాన్ని తీసుకుంటున్నారని సర్వే వెల్లడించడం గమనార్హం.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications