కలకలం: ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో లష్కరే తోయిబా ఉగ్రవాది కలకలం సృష్టించాడు. గుజరాత్ యాంటీ-టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఆపరేషన్ లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్ కావా. 2000 సంవత్సరంలో రెడ్ ఫోర్ట్ వద్ద 'లష్కరే' చేసిన దాడిలో బిలాల్ అహ్మద్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించే నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పలువురు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు ముమ్మరం చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications