దినకరన్ హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు, మిగిలిన వారు వెళ్లిపోతారని మన్నార్ గుడి మాఫియా?
చెన్నై: తమిళనాడు ప్రభుత్వాన్ని కుప్పకూల్చేస్తా అంటూ బెదిరింపులకు దిగిన శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. 37 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని విర్రవీగిన దినకరన్ కు 20 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు.
కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీటీవీ దినకరన్ కు విశ్వాసం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం విలీనం దశగా అడుగులు వేస్తున్న సమయంలో దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు చిన్నగా జారుకుంటున్నారు.

తనకు విశ్వాసం ప్రకటించిన ఎమ్మెల్యేలు జారిపోకుండా టీటీవీ దినకరన్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. విలీనం కోసం తాను ఇచ్చిన 60 రోజుల గడుపు ఈనెల 5వ తేదీతో ముగిసిపోవడంతో దినకరన్ అన్నాడీఎంకే పార్టీకి కొత్త కార్యవర్గం ప్రకటించారు.
అందులో 19 మంది ఎమ్మెల్యేలకు కీలకపదవులు ఇచ్చినా ఇద్దరు ఎమ్మెల్యే మాకు ఆ పదవులు వద్దు అంటూ పళనిసామి వర్గంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్బంలో తన వెంట ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాలని టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications