మోదీ వేరియంట్ టూల్కిట్ వివాదం -బీజేపీ చీఫ్ నడ్డా సహా నలుగురి ట్విటర్ ఖాతాల రద్దుకు కాంగ్రెస్ ఫిర్యాదు
కరోనా వైరస్ తనపని తాను చేసుకుంటూ వేలమందిని పొట్టన పెట్టుకుంటుడగా, రాజకీయ పార్టీలు సైతం వైరస్ చుట్టూ వాదులాటలు కొనసాగిస్తున్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో పూర్తిగా విఫలైన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు నేరుగానే తిట్టిపోస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం మోదీ పరువు తీయడానికి ఏకంగా టూల్ కిట్ ను రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, సదరు ఆరోపణను అవాస్తవంగా పేర్కొన్న కాంగ్రస్.. తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ టాప్ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నది...
కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని ఆరోపించిన బీజేపీ.. కొవిడ్-19 మ్యూటెంట్ను ''ఇండియన్ స్ట్రెయిన్'', ''మోదీ స్ట్రెయిన్'' అని పిలవాలంటూ తన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ''టూల్కిట్'' ద్వారా సూచనలు ఇస్తోందని బీజేపీ ముఖ్యులు వరుసగా కొన్ని డాక్యుమెంట్లను బటయపెట్టారు. అయితే, సదరు డాక్యుమెంట్లను నకిలీవిగా కాంగ్రెస్ గుర్తించింది. ఆ మేరకు..

ట్విట్టర్ వేదికగా అధికార బీజేపీ టూల్కిట్ అంశాన్ని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను సృష్టిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సంబిత్ పాత్రా, బి.ఎల్. సంతోశ్ ట్విట్టర్ ఖాతాలను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్విట్టర్కు ఓ లేఖ రాశామని కాంగ్రెస్ సోషల్ మీడియా నేత రోహన్ గుప్తా తెలిపారు.
''నకిలీ పత్రాలను వ్యాప్తి చేయడంలో మునిగిపోయిన బీజేపీ నాయకుల ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము ట్విట్టర్ యాజమాన్యానికి అధికారికంగా లేఖ రాశాం. ఇప్పటికే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది. స్వతంత్రులు కూడా బీజేపీ ప్రచారంలో మునిగిపోయారు. బీజేపీ నేతలు ట్విట్టర్ను తప్పుగా వినియోగిస్తున్నారు'' అని రోహన్ గుప్తా మండిపడ్డారు.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications