దమ్ముంటే ఎన్నికల కమిషన్ కు లేఖ ఇవ్వండి: సీఎంకు చాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ !
తమినాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామి చాల ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయన నమ్మక ద్రోహం చేశారని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ మండిపడ్డారు.
చెన్నై: తమినాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామి చాల ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయన నమ్మక ద్రోహం చేశారని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలో తగిన బుద్ది చెబుతామని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.
శుక్రవారం తంజావూరులో మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ ఎడప్పాడి పళనిసామి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తొలగించడానికి ఎడప్పాడి పళనిసామికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు.

తనను పదవి నుంచి తొలగించామని ఎడప్పాడి పళనిసామి సంతకం చేసి ఎన్నికల కమిషన్ కు సమర్పించే దమ్ము ఉందా అంటూ టీటీవీ దినకరన్ ప్రశ్నించారు. అన్నాడీఎంకే పార్టీ మీద శశికళ తరువాత సర్వాధికారాలు అన్నీ నాకే ఉన్నాయని టీటీవీ దినకరన్ చెప్పారు.
మరో వైపు టీటీవీ దినకరన్ మద్దతుదారుడు, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది మీడియాతో మాట్లాడుతూ త్వరలో దినకరన్ చెన్నై వెలుతారని, అక్కడికి వెళ్లిన తరువాత అందరికీ తగిన బుద్ది చెబుతాడని, ఎడప్పాడి పళనిసామి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేరని అన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications