ట్వీస్ట్: బెంగళూరు పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్లు మాయం, దొంగ పోలీసులు, ఏసీపీ !
బెంగళూరు: బెంగళూరు సీసీబీ పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్ల విలువైన పాత నోట్లు (రూ. 1,000, రూ. 500) మాయం అయిన కేసులో కొత్త ట్వీస్ట్. పోలీసు అధికారులే పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్లు మాయం చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు సీసీబీ డీసీపీ జితేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరు సీసీబీ ఏసీపీ ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన హైగ్రౌండ్స్ సమీపంలోని ఓ మహిళ ఇంటిలో దాడులు చేసిన సీసీబీ పోలీసులు రూ. 3 కోట్ల విలువైన రద్దు అయిన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ సందర్బంలో రూ. 1 కోటి 6 లక్ష్లలకు మాత్రమే లెక్కలు చూపించిన పోలీసులు మిగిలిన సోమ్మును బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీసులు డ్రామాలు ఆడారు.
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీస్ స్టేషన్ నుంచి నగదు మాయం అయిన విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సదరు ఏసీపీ, సబ్ ఇన్స్ పెక్టర్ హూంబేగౌడ, కానిస్టేబుల్స్ నరసింహమూర్తి, గంగాధర్ మాయం అయ్యారు. ఈ కేసులో మహిళకు, పోలీసులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రమేష్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1. 94 కోట్లు మాయం చేసిన దొంగ పోలీసుల కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications