గర్వించే పని చేశాం, విమర్శలు గుప్పిస్తారా: మీడియాపై మాల్యా

భారత్ మీడియా పైన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లండన్: భారత్ మీడియా పైన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్‌లోకి భారత్ విజయవంతంగా ప్రవేశించినందుకు గర్వించడానికి బదులు తన పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

భారత్ మీడియా తన పైన విమర్శలు గుప్పించడంలో తీరిక లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

విజయ్ మాల్యా నేతృత్వంలోని సహారా ఫోర్స్ ఇండియా టీమ్ నూతన ఫార్ములా వన్ కారును బ్రిటన్‌లో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ మాల్యా పాల్గొన్నారు.

Very unfortunate media do not share pride that an Indian entry into Formula 1: Vijay Mallya

దీనిపై ట్విట్టర్లో స్పందించారు. 2017 సహారా ఫోర్స్ ఇండియా ఛాలెంజర్‌ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. టీమ్ ప్రిన్సిపల్‌గా అది తన డ్యూటీ అని చెప్పారు. భారత్ మీడియా కామెంట్స్ చాలా బాధాకరమంగా ఉన్నాయన్నారు.

కాగా, మాల్యా ఫార్ములా వన్‌ కారు రేసింగ్‌ బృందం సహారా ఫోర్స్‌ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్వర్ స్టోన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్‌, ఈస్ట్‌బన్‌తో కలిసి ఫొటోలు దిగారు.

వీటిన ఫార్ములా వన్‌.కామ్‌లో అప్‌లోడ్ చేశారు. మన దేశం నుంచి పారిపోయిన తర్వాత లండన్‌లోనే అజ్ఞాతంలో ఉంటున్న విజయ్ మాల్యా.. తొలిసారి ఇలా బయట జరిగిన కార్యక్రమంలో దర్శనమివ్వడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+