గర్వించే పని చేశాం, విమర్శలు గుప్పిస్తారా: మీడియాపై మాల్యా
భారత్ మీడియా పైన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లండన్: భారత్ మీడియా పైన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్లోకి భారత్ విజయవంతంగా ప్రవేశించినందుకు గర్వించడానికి బదులు తన పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.
భారత్ మీడియా తన పైన విమర్శలు గుప్పించడంలో తీరిక లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
విజయ్ మాల్యా నేతృత్వంలోని సహారా ఫోర్స్ ఇండియా టీమ్ నూతన ఫార్ములా వన్ కారును బ్రిటన్లో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ మాల్యా పాల్గొన్నారు.

దీనిపై ట్విట్టర్లో స్పందించారు. 2017 సహారా ఫోర్స్ ఇండియా ఛాలెంజర్ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. టీమ్ ప్రిన్సిపల్గా అది తన డ్యూటీ అని చెప్పారు. భారత్ మీడియా కామెంట్స్ చాలా బాధాకరమంగా ఉన్నాయన్నారు.
కాగా, మాల్యా ఫార్ములా వన్ కారు రేసింగ్ బృందం సహారా ఫోర్స్ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్వర్ స్టోన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్, ఈస్ట్బన్తో కలిసి ఫొటోలు దిగారు.
వీటిన ఫార్ములా వన్.కామ్లో అప్లోడ్ చేశారు. మన దేశం నుంచి పారిపోయిన తర్వాత లండన్లోనే అజ్ఞాతంలో ఉంటున్న విజయ్ మాల్యా.. తొలిసారి ఇలా బయట జరిగిన కార్యక్రమంలో దర్శనమివ్వడం గమనార్హం.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications