viral video:అర్ధరాత్రి మాల్లో జనం చూశారా..? క్రౌడ్ మాములుగా లేదుగా, రీజన్ ఇదే..
ఆఫర్ అంటే చాలు మెట్రో పాలిటన్ నగరాల్లో నివసించే జనం ఎగిరి గంతేస్తారు. 20, 30 పర్సెంట్ అంటేనే ఎగబడి మరీ కొంటారు. కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుంది. మరీ 50 శాతం డిస్కౌంట్ అంటే ఆ క్రౌడ్ మాములుగా ఉండదు. అదీ డే అయితే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరీ నైట్ అయితే చెప్పక్కర్లేదు. అవును రాత్రి పూట ఓ షాపింగ్ మాల్ తెరిచారు. ఇంకేముంది జనం రద్దీ మాములుగా లేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.
50 శాతం డిస్కౌంట్
కేరళలో గల తిరువనంతపురం, కొచ్చిలో గల లులు షాపింగ్ మాల్ ఈ ఆఫర్ పెట్టింది. ఈ 6వ తేదీన రాత్రి 11.59 గంటల నుంచి ఆ మరునాడు ఉదయం వరకు షాపింగ్ మాల్ తెరిచారు. ముందే ఆఫర్ తెలియక జనం నుంచి మాములగా రెస్పాన్స్ రాలేదు. చాలా మంది వచ్చారు. ఆ షాపింగ్ మాల్ మెట్టు ఎక్కే సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ట్రాఫిక్ చిక్కులు లేవు..
మెట్రో పాలిటన్ నగరాల్లో మిడ్ నైట్ షాపింగ్ మాల్ తెరిచామని నిర్వాహకులు తెలిపారు. కానీ జనం అసలు పండుకోలేదని లులు గ్రూపు రీజనల్ డైరెక్టర్ జాయ్ సదానందన్ వివరించారు. రాత్రిపూట షాపింగ్ వల్ల జనం ట్రాఫిక్ చిక్కులను అధిగమించొచ్చు అని తెలిపారు.
ప్రశాంతమైన వాతావరణంలో నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయొచ్చు అని వివరించారు. ఇదీ ట్రయల్ చేశామని.. మిడ్ సేల్ మరిన్ని రోజులు చేపడుతామని చెప్పారు. మిడ్ నైట్ సేల్ సమయంలో ఇబ్బందులు ఉంటాయని తమకు తెలుసు అని చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ భవిష్యత్లో అధిగమిస్తామని తెలిపారు.
బ్లాక్ ఫ్రైడే, కొవిడ్ మాల్ అంటూ
అయితే చాలా మంది మెట్ల మీద, లాబీలో నిల్చొని వీడియోలో కనిపించారు. గెటు తీసిన వెంటనే జనం పరుగు తీశారు. వీడియోపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇదీ బ్లాక్ ప్రైడేగా నిలిచిందని తెలిపారు. మరికొందరు ఇదీ కొవిడ్ మాల్ అని పేర్కొన్నారు. మాల్లో కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారని ఫైరయ్యారు. కానీ వీడియోలో కొందరు అలా మాస్క్ పెట్టుకొని కనిపించారు.