యోగా ప్రపంచ ఉద్యమం, సెల్ఫోన్ లాగే: మోడీ(వీడియో)
ఛండీగఢ్: మానసికంగా, భౌతికంగా ఉల్లాసం కలిగించే యోగాను నిత్యం సాధన చేస్తూనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా ఛండీగఢ్లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.
PM participates in mass yoga demonstration at Capitol Complex, Chandigarh, on the occasion of 2nd #IYD2016 #YogaDay pic.twitter.com/EMIabh6Pin
— PIB India (@PIB_India) 21 June 2016
వ్యక్తిగత, మానసిక, సామాజిక ఆరోగ్యానికి యోగాకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. యోగా సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వృద్ధి చెందుతాయని చెప్పారు. మానసిక ఏకాగ్రత యోగా వల్లే సాధ్యమవుతుందని ప్రధాని మోడీ వివరించారు. యోగా సాధన కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఆస్తికులు, నాస్తికులు అందరికీ యోగా అవసరమన్నారు.

యోగాకు పేద, ధనిక తారతమ్యం లేదదని, పేదవాడైనా, జమిందారైనా యోగా సాధన చేయవచ్చన్నారు. రోగనివారణ ప్రత్యామ్నాయాల్లో యోగాకు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యోగా శిక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ఓ విధానాన్ని డబ్ల్యూహెచ్ఓ రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు.
ఈ ఏడాది నుంచి యోగాను ప్రోత్సహించేందుకు 2 పురస్కారాలు ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ఏడాది మధుమేహ నివారణపై ప్రధానంగా దృష్టిపెట్టామని, మధుమేహ వ్యాధి నివారణలో యోగా ఔషధంలా పనిచేస్తుందన్నారు. సెల్ ఫోన్ లాగే యోగా కూడా జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు.
A bird's eye view of the #YogaDay celebrations in Chandigarh. Photo credit: Pradip Das Gupta pic.twitter.com/y6NYY8Sh4U
— PIB India (@PIB_India) 21 June 2016
అనేక అంతర్జాతీయ దినోత్సవాలున్నా యోగాకు ఉన్న ప్రాముఖ్యత గొప్పదని, ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా జరుపుకొంటున్న పండుగ యోగా అని తెలిపారు. యోగా ప్రాధాన్యత వల్ల శిక్షకుల అవసరం పెరిగిందని వివరించారు. ప్రసంగం ముగించిన అనంతరం ప్రధాని మోడీ.. యోగా ర్యక్రమానికి హాజరైన యువతతో కరచాలనం చేశారు. ఛండీగఢ్లో యోగా దినోత్సవంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు దాదాపు 30వేల మంది పాల్గొన్నారు.
PM @narendramodi at the Capitol Complex, Chandigarh, on the occasion of 2nd #IYD2016 #YogaDay pic.twitter.com/0BCrWnIdQS
— PIB India (@PIB_India) 21 June 2016
దేశ వ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న భారీ ఉత్సవాల్లో 57మంది కేంద్రమంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తుస్తున్నాయి.

రాష్ట్రపతి భవన్లో యోగా వేడుకలు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రపతి భవన్ సిబ్బంది, ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications