మాజీ అధ్యక్షుడి లక్ష్యం, బుల్లెట్ల వర్షం: తాలిబన్లు అంతం
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మరోసారి తెగించారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరి, ఏకే- 47 తో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులలో తాలిబన్లు అంతమయ్యారు.
మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబ సభ్యులు దేశ రాజధాని కాబుల్ లోని దౌత్య కార్యాలయం గెస్ట్ హౌస్ లో ఉన్నారు. బుధవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నలుగురు తాలిబన్లు అక్కడికి వెళ్లారు.

తరువాత ఆరు బాంబులు పేల్చివేశారు. విషయం పసిగట్టిన భద్రతా దళాలు ఎదురు కాల్పులకుదిగారు. సుమారు ఆరు గంటల పాటు ఉగ్రవాదులను ఎదుర్కున్నారు. ముగ్గురు తాలిబన్లు ఏకే- 47తో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఒకరు బాంబులు విసురడమే పనిగా పెట్టుకున్నాడు.
చివరికి నలుగురు ఉగ్రవాదులను అంతం చేశారు. విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భద్రతా దళాల కాల్పులలో నలుగురు తాలిబన్లు మరణించారని మంత్రి వజీర్ అక్బర్ ఖాన్ తెలిపారు.
రబ్బానీ కుటుంబాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని, అందుకే దాడి చేశామని తాలిబన్లు వెల్లడించారు. రబ్బానీ కుమారుడు సలావుద్దీన్ ప్రస్తుతం ఆదేశ విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో తాలిబన్లు బరితెగించడంతో ఆ కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications