సముద్ర జలాల కదలికలపై చైనా సరికొత్త నిఘా, ఐనా ఆమెరికాకు దూరమే
బీజింగ్: సముద్రం లోపల ఇతర దేశాలకు చెందిన జలంతర్గాములు, క్షిపణి వ్యవస్థలను కనిపెట్టేందుకు చైనా సరికొత్త నిగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని హిందూ మహాసముద్రంతో పాటు మారిటైమ్ సిల్క్ రోడ్డులో ఏర్పాటు చేస్తోంది.
దీనిని సముద్రం లోపల కదలికలు, నీటి సాంధ్రత, సముద్ర నీటి ఉష్ణోగ్రత, సముద్ర జీవుల సమాచార సేకరణ తదితర పనులు చేయడంతో పాటు వివిధ దేశాలకు చెందిన జలాంతర్గాముల రాకపోకలపై కన్నేసి ఉంచుంది.

అందుకే కొత్త నిఘ వ్యవస్థ
ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థ పని చేయడం ప్రారంభించిందని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయాలనేది చైనా ఆలోచనగా భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చైనా అకాడమీ ఆఫ్ సెన్సెస్ పర్యవేక్షణలో సౌత్ చైనా సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనాలజీ నిఘా వ్యవస్థను రూపొందించింది.

అక్కడ సమాచార విశ్లేషణ
దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం, హిందు మహా సముద్రాల్లో ఈ నిఘా వ్యవస్థను అమలులోకి తీసుకు వచ్చింది. ఇలా సేకరించిన సమాచారం దక్షిణ చైనా సముద్రంలోని పారిస్ల్ దీవుల్లో, దక్షిణ చైనాలోని గ్వాంగ్డాగ్, దక్షిణ ఆసియాలో నెలకొల్పిన మూడు సమాచార సేకరణ కేంద్రాలకు చేరుకుంటుంది. అక్కడ సమాచారాన్ని విశ్లేషిస్తారు.

చైనా ఆలోచనలు
పైరేట్స్ సమస్యను అధిగమించేందుకు కూడా ఈ నిఘాను అదికం చేస్తుంది. గస్తీ పడవలను తిప్పటంతో పాటు జలాంతర్గాములను ఎంపిక చేసిన ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచింది. హిందూ మహా సముద్రంలో సరకు రవాణా పోర్టులను నెలకొల్పే ఆలోచనలతోను చైనా ఉంది. గత ఏడాది శ్రీలంక నుంచి హంబన్ తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు అద్దెకు తీసుకుంది.

చైనా ఎంతగా ప్రయత్నాలు చేసినా
అంతర్జాతీయ పెత్తనం కోసం చైనా ఎంతగా ప్రయత్నాలు చేసినా.. అమెరికా అధిపత్యాన్ని సవాల్ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్న సముద్ర నిఘా వ్యవస్థ, యంత్రాంగంతో పోల్చితే చైనా చాలా దూరంలో ఉంటుందని అంటున్నారు. అయితే దీర్ఘకాలానికి ఈ అడుగులు వేస్తున్నట్లుగా చైనా నిపుణులు చెబుతున్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications