భారత సంతతి ప్రీతిపటేల్కు బ్రిటన్లో కేబినెట్ హోదా, పాక్ జాతీయుడికీ
లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో భారతీయురాలికి చోటు దక్కింది. ప్రధాని కామెరాన్ నూతన కేబినెట్లో భారతీయ సంతతి మహిళకు చోటు ఇచ్చారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పాటిల్ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమించారు.
మే ఏడో తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎస్సెక్స్లోని విఠమ్ నుండి ఆమె ఎంపీగా తిరిగి గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఆమె పని చేశారు. బ్రిటన్ ప్రధాని తరఫున భాత సంతతి వ్యక్తుల యోగక్షేమాలను పర్యవేక్షించే పాత్రలోను ప్రీతి పటేల్ కొనసాగే అవకాశముంది.

ఉపాధిశాఖ మంత్రిగా నియమితులవడం పట్ల ప్రీతి పటేల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రీతి సహా పలువురు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పార్టీ పైన ఉన్న పురుషాధిక్య ముద్రను తొలగించేందుకు కామెరూన్ ప్రయత్నించారని అంటున్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీ సాజిద్ జావిద్ను కూడా కూడా కామెరూన్ కేబినెట్లోకి తీసుకున్నారు. సాంస్కృతిక శాఖ నుండి వాణిజ్య శాఖ మంత్రిగా సాజిద్ను మార్చారు. కాగా, సాజిద్ ఓ బస్సు డ్రైవర్ కొడుకు కావడం గమనార్హం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications