మైకేల్ పాటకు బిలియనీర్ జాక్ మా డ్యాన్స్: హోరెత్తించారు(వీడియో)
చైనాలోనేగాక, ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరైన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
బీజింగ్: చైనాలోనేగాక, ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరైన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తన కంపెనీ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై అదిరిపోయే స్టెప్పులేసి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

అంతా షాక్..
దివంగత దిగ్గజ డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ వస్త్రధారణలోనే ‘డేంజరస్' పాటకు జాక్ మా స్టెప్పులేసి తన ఉద్యోగులను అలరించారు. అంతేగాకుండా చివర్లో స్టేజీ మీద బైక్తో విన్యాసాలు కూడా చేశారు.

గతంలోనూ ఇలాగే..
గతంలో అలీబాబా కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా కూడా జాక్ మా తన గొంతు సవరించుకుని, పాట పాడారు. నాటకాలు, కళల మీద ఆసక్తి ఉన్న జాక్ మా.. అలీబాబా కంపెనీ స్థాపించడానికి ముందు కూడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు.

హోరెత్తించారు..
కాగా, తాజాగా జాక్ మా ఇచ్చిన డ్యాన్స్ షో మాత్రం ఉద్యోగులను హోరెత్తించింది. వేదికపై స్టెప్పులేస్తూ ఉద్యోగాలను ఉత్సాహపరిచారు జాక్ మా. ఆయనతోపాటు పలువురు కంపెనీ ప్రతినిధులు కూడా కాలు కదపడం గమనార్హం.
అవమానాల నుంచి ఫోర్బ్స్ కవర్ పేజీ వరకు..
జాక్ మా జీవితాన్ని గమనించినట్లయితే ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఉద్యోగం కోసం ప్రముఖ కంపెనీలకు వెళితే ఎక్కడా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆయనే స్వయంగా ఓ కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘అలీబాబా'ను స్థాపించిన జాక్ మా.. ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్ మేగజైన్ కవర్ పేజీకి ఎక్కారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications