ఎంహెచ్ 370: ఘటన జరిగిన ఏడాదికి.. ముందు రోజు నివేదిక
కౌలాలంపూర్: గత ఏడాది మార్చి 8వ తేదీన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికి ఒక్కరోజు ముందు దీని పైన నివేదికలు వెలువడనున్నాయి. ఈ విషయమై మలేషియా దేశ ఉప రవాణా శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఎంహెచ్ 370 విమాన ప్రమాదం 2014 మార్చి 8న జరిగిందని, ఈ ఘటన పైన మార్చి 7వ తేదీన నివేదికలు వెల్లడవుతాయని మంత్రి చెప్పారు. దీని పైన నివేదిక చాలా పెద్దగా ఉందని ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిందని, ఈ నివేదిక వందలాది పేజీలు ఉంటుందని చెప్పారు. ఎంహెచ్ 370 ప్రమాదంలో చనిపోయిన 239 మందిలో భారతీయులు ఐదుగురు.
కాగా, చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ మార్చి 8, 2014న మలేషియా విమానం ఎంహెచ్-370 ఆచూకీ గల్లైంతన విషయం తెలిసిందే. దీని ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ విమాన శకలాలు హిందూ మహాసముద్రంలో కనిపించాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా ఆచూకీ తెలియరాలేదు.

ఇటీవల ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎంహెచ్ 370 గల్లంతైనప్పుడు ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. అది ఇటీవల ఎయిర్ ఏషియా కూలినప్పుడు చర్చనీయాంశమైంది.
మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైంది. ఆ తర్వాత నెలలో అంటే ఆ విమానం గల్లంతైన ఆరు వారాల తర్వాత ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. తమ పైలట్ ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తాడని, తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదని దాని సారాంశం. ఆ ప్రకటన చేసిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలింది.
అయితే, అలాంటి సమయంలో ఎయిర్ ఏషియా ప్రకటన పైన విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఏషియా కూడా దాని పైన ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. తాము ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాతుక్ మెరనన్ ఆ తర్వాత చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications